Published On May 21, 2022
జన అధికార సమితి మరియు ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో మానకొండూర్ నియోజక వర్గం శంకర పట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు మౌ మట్టి నివేదన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.శంకర పట్నం మెయిన్ చౌరస్తా నుండి భారీ ర్యాలితో ప్రత్యేకంగా అలంకరించిన బుట్టలతో మౌ మట్టిని తీసుకొని గౌరవ అతిథులు పరికిపండ్ల నరహరి ఐ.ఎ.ఎస్ మరియు నాయకులు మాజీ శాసన సభ్యులు ఆరెపల్లి మోహన్,ఫుడ్ కార్పోరేషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్,పాత్రికేయులు బొంకూరి మధు మరియు అంబేద్కరిస్టులతోపాటు సానంస్కృతిక కళాకారులతో ర్యాలీగా అంబెద్కర్ విగ్రహం వరకు చేరుకున్నారు.అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు మౌ మట్టినిసమర్పించి ఆ మహనీయుని ఆశయాలను కొనసాగిస్తామని ప్రతినబూనారు.